రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో కీలక మార్పు.. రైల్వే శాఖ నిర్ణయం

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (16:33 IST)
అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో భారతీయ రైల్వే కీలక మార్పు చేసింది. దీపావళి పండుగకు ముందు ఈ కీలక మార్పు చేయడం గమనార్హం. ఇప్పటివరకు అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ 120 రోజులుగా ఉండేది. దీన్ని ఇపుడు సగానికి తగ్గించింది. అంటే 60 రోజులకు కుదించింది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నిర్ణీత సమయానికి 120 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఇప్పటివరకు ఉండేది. ఇకపై కాల పరిమితి 60 రోజులకే కుదించింది. 
 
ఈ కీలక నిర్ణయం నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే, నవంబర్ ఒకటో తేదీకి ముందు బుకింగ్ చేసుకునేవారికి కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకావని తెలిపింది. 
 
తాజ్ ఎక్స్‌ప్రెస్, గౌమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యధాతథంగా కొనసాగుతుందని తెలిపింది. నిజానికి ఈ రైళ్లకు అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ సమయం తక్కువగా ఉంది. అదేసమయంలో విదేశీయులకు మాత్రం 365 రోజుల అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments