Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణాలైనా ఇస్తారు: మోడీ

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:34 IST)
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత పలు హిందూ గ్రూపులు, ముస్లింలపై పరుష పదజాలంతో విరుచుకుపడటం మొదలు పెట్టాయి. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం భారతీయ ముస్లింల ఉదాత్తమైన మనోభావాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ‘‘భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. 
 
అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు. భారత్‌కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు’’ అంటూ ఓ అమెరికా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్రవారం ఆయన వెల్లడించారు. 
 
‘‘అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారతీయ ముస్లింల గురించి తప్పుగా అర్థం చేసుకుంటోంది. తమ ట్యూన్లకు అనుగుణంగా భారతీయ ముస్లింలు స్టెప్పులేస్తారని అనుకుంటోంది’’ అని కూడా మోడీ వ్యాఖ్యానించారు.
 
ఇస్లాం పేరిట జరుగుతున్న విశ్వవ్యాప్త పోరులో పాలుపంచుకోవాలని భారతీయ ముస్లింలకు పిలుపునిస్తూ, ఇటీవల అల్ ఖైదా చీఫ్ అయిమాన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియోపై మోడీ ఈ మేరకు ఘాటుగా స్పందించారు. తద్వారా భారతీయ ముస్లింల గొప్పదనాన్ని, దేశభక్తిని ప్రపంచానికి తెలియజేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments