Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు సై : సీసీఎస్

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (12:54 IST)
భారత వాయుసేన అవసరాలను తీర్చేందుకు భారీ స్థాయిలో యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన సీసీఎస్ (క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 73 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, మరో 10 శిక్షణ విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఈ విమానాల కొనుగోలుకు రూ.45,696 కోట్లను వ్యయం చేయనున్నారు. 
 
తేజస్ యుద్ధ విమానాలు పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయన్నారు. ఎంకే-1ఏ లైట్ కాంబాయ్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు నాలుగో తరానికి చెందినవి. వీటిల్లో ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్, గాల్లోనే ఇంధనం నింపుకునే సదుపాయంతో పాటు ఏఈఎస్ఏ సదుపాయాలుంటాయి. భారత వాయుసేనకు ఇవి వెన్నెముకగా నిలుస్తాయని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. 
 
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే తేజస్ విమానాలు దేశ రక్షణకు ఎంతో ఉపకరిస్తాయని, వీటిల్లో ఇంతవరకూ వాడని టెక్నాలజీని వాడారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
 
నూతన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంతో భారత వాయుసేన మరింత బలోపేతమైందని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. ఈ డీల్ కారణంగా మరిన్ని కొత్త ఉద్యోగాలు సైతం లభించనున్నాయని అన్నారు. 
 
ఇదిలావుండగా, సీసీఎస్ కమిటీ సమావేశంలో ఈ యుద్ధ విమానాల నిర్వహణ, మరమ్మతులకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments