Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ప్రజలకు నిద్రాభంగం... అమ్మతోడు కంటినిండా కునుకు కరువు

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (11:34 IST)
దేశంలోని 140 కోట్ల జనభాలో 59 మందికి కంటి నిండా కునుకు లేదట. ఎలాంటి అంతరాయం లేకుండా కనీసం ఆరు గంటల పాటు ఏకధాటిగా నిద్రపోలేకపోతున్నట్టు తేలింది. ఈ నెల 14వ తేదీన "ప్రపంచ నిద్ర దినం". ఈ సందర్భంగా లోకల్ సర్కిల్ అనే సంస్థ దేశ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 343 జిల్లాల్లోని 40 వేల మంది అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 61 శాతం మంది పురుషులు, 59 శాతం మంది మహిళలు ఉన్నారు. 
 
ఈ సర్వే సంస్థ నివేదిక ప్రకారం 39 శాతం మంది మాత్రమే ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోతున్నారట. మరో 39 శాతం మంది నాలుగు నుంచి ఆరు గంటల పాటు నిద్రపోతున్నారు. 2 శాతం మంది మాత్రమే కంటికి సరిపడా నిద్రపోతున్నారు. వీరు ప్రతి రోజూ 8 నుంచి 10 గంటలపాటు నిద్రపోతున్నట్టు నివేదిక తెలిపింది. 20 శాతం మంది 4 గంటలు కూడా నిద్రపోవడం లేదు. మొత్తంగా చూసుకుంటే 59 శాతం మంది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదు. 
 
సరైన నిద్రకు నోచుకోకపోవడానికి గల కారణాలను కూడా లోకల్ సర్కిల్ వెల్లడించింది. ఆలస్యంగా నిద్రపోవడం, త్వరగా లేవాల్సి రావడం, సెల్‌ఫోన్లు, దోమలు, బయటి శబ్దాలు, పిల్లల అల్లరి కారణంగా సరిగా నిద్రపోలేకపోతున్నట్టు సర్వేలో పాల్గొని పలువురు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా అంటూ చిరంజీవి పలుకరించడంతో ఆశ్చర్యపోయా : హీరో నాని

Kriti sanon ఐఐఎఫ్ఎ అవార్డ్స్ 2025లో కృతి సనన్ లుక్స్ వైరల్ video

మంచు విష్ణు "కన్నప్ప"కి విమర్శల పరంపర - లిరికల్ సాంగ్ రిలీజ్‌తో చెలరేగిన దుమారం!!

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments