Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య పరుగులు పెట్టనున్న తొలి బుల్లెట్ రైలు

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (09:54 IST)
భారతీయ రైల్వే శాఖ వేగవంతమైన రవాణా సౌకర్యాల కల్పనపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇప్పటికే వందే భారత్ పేరుతో సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇపుడు హైస్పీడ్ రైళ్లను కూడా తీసుకొచ్చేందుకు దృష్టిసారించింది. ఇందుకోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది భారత్‌లో బుల్లెట్ రైల్ కలను సాకారం చేసే దిశగా ఒక కార్యాచరణను రూపొందించనుంది. అన్నీ అనుకూలంగా సాగితే తొలి బుల్లెట్ రైల్ ముంబై - అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య పరుగులు పెట్టనుంది. ఇది 2027 నాటికి పట్టాలెక్కనుంది. 
 
జపాన్‌ రైల్వే శాఖ షింకాన్ సెన్ పేరిట ఎన్నో ఏళ్ళుగా అత్యంత సమర్థతతో బుల్లెట్ రైళ్లను నడుపుతున్న విషయం తెల్సిందే. ఈ హైస్పీడ్ రైళ్ళ గరిష్ట వేగం 320 కిలోమీటర్లు. ఇలాంటి బుల్లెట్ రైళ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 24 షింకాన్ సెన్ రైళ్లను కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తుంది. వాటి అంచనా వ్యయం రూ.11 వేల కోట్లు. ప్రధానంగా జపనీస్ సంస్థలనే బిడ్డింగ్‌కు కేంద్రం ఆహ్వానించనుంది. జపాన్ దేశానికి చెందిన ఈ సంస్థలకు షింకాన్ సెన్ రైళ్ల తయారీ, నిర్వహణలో అపారమైన అనుభవం ఉంది. అందుకే కేంద్రం ఈ తరహా చర్య తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments