Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరస్ వ్యాప్తి అడ్డుకట్టే లక్ష్యంగా లాక్‌డౌన్ మరింత కఠినం?

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (19:40 IST)
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి విషయంలో భారత్ అత్యంత కీలక దశకు అంటే రెండో దశకు చేరుకుంది. మొదటి దశలో పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పొచ్చు. అందుకే ఈ రెండో దశను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత సవాల్‌గా స్వీకరించనున్నాయి. ముఖ్యంగా, లాక్‌డౌన్‌లో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 14వ తేదీ వరకు అత్యంత కీలకంకానున్నాయి. అందుకే ఈ 14 రోజులపాటు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరంగా అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 
 
మంగళవారం సాయంత్రానికి దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1429కి చేరుకుంది. అలాగే, మరణాలు కూడా నాలుగు పదులకు చేరుకున్నాయి. దీంతో ఏప్రిల్ 14వ తేదీనాటికి ఈ మహమ్మారిని అడ్డుకోలమా? అన్నది ఇపుడు ప్రభుత్వం ముందు పెనుసవాల్‌గా మారింది. అందుకే మిగిలిన 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా, కఠినంగా అమలు చేస్తారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
అదేసమయంలో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన చాలా మందికి 14 రోజుల పాటు విధించిన క్వారంటైన్ పూర్తయింది. ఇలాంటి వారిని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. పైగా, క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఇప్పటికే పది శాతానికి పైగా విడుదల చేయడం జరిగింది. మరోవారం రోజుల్లో వీరి సంఖ్య 50 శాతానికి చేరుకోవచ్చు. 
 
అంటే, ప్రస్తుతానికి కరోనా వైరస్ భారత్‌లో అదుపులోనే ఉందని చెప్పొచ్చు. కానీ, వచ్చే వారం రోజుల్లో ఈ కట్టు ఇలానే కొనసాగితే, భారత్ సురక్షితంగా ఈ మహమ్మారి నుంచి బయటపడటం ఖాయమని ఆరోగ్య వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments