Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్.. యుద్ధం వస్తే విజయం మాదే : బిపిన్ రావత్

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (13:08 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. యుద్ధమంటూ జరిగితే విజయం మాదేనని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చాక బ్రిటిష్ చేతిలో నుంచి ఆర్మీ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చిన రోజు 1949 జనవరి 15వ తేదీ. ఆ రోజున ఇండియన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఫీల్డ్ మార్షల్ ఎం. కరియప్ప బాధ్యతలను తీసుకున్నారు. ఆ రోజును భారత ఆర్మీ డేగా జరుపుకుంటున్నాం. 
 
ఈ వేడుకల్లో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పాల్గొని మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించడం మానకపోతే తాము కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం వస్తే భారత్ తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పారు. దేశ రక్షణ దృష్ట్యా ఎంతటి ప్రమాదకర పరిస్థితులనైనా ఎదుర్కోగలిగేలా బలగాలు ఎదగాలని సూచించారు. 
 
పాకిస్థాన్ పదే పదే సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడుతోందని, వాటిని భారత్ సమర్థంగా తిప్పికొడుతోందని అన్నారు. అయితే ఈ ప్రయత్నంలో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. మన శత్రువు ఉగ్రవాదులను ప్రోత్సహించడం ఆపడం లేదని, వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయుధాలు కూడా చేతికిచ్చి భారత్‌పైకి ఉసిగొల్పుతోందని జనరల్ రావత్ అన్నారు. దీనిపై భారీ రియాక్షన్‌కు కూడా భారత్ వెనుకాడబోదని బిపిన్ రావత్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments