Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో సమీప భవిష్యత్‌లో యుద్ధం తప్పదా?.. దల్బీర్ సింగ్ ఏమన్నారు?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (09:02 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాలు సమరానికి కాలుదువ్వుతున్నాయా? అలాంటి పరిస్థితులు ఇరు దేశాల్లో నెలకొన్నాయా? అంటే భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ మాత్రం అవుననే అంటున్నారు. నిజానికి భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో నిరంతరం ఓ మినీ యుద్ధమే సాగుతోంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి పెరిగిన చొరబాట్ల కారణంగా సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. దీంతో భారత సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. 
 
ఈ పరిస్థితులపై ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ స్పందిస్తూ పాకిస్థాన్‌తో స్వల్పకాలిక, మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో 1965నాటి భారత్‌-పాక్‌ యుద్ధంపై నిర్వహించిన త్రివిధ దళాల కీలక సిబ్బంది సదస్సులో ఆయన పైవిధంగా స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల నిరంతర చొరబాటు యత్నాలు, వారికి దన్నుగా పాక్‌ కవ్వింపు కాల్పులు పెరిగాయన్నారు. ఈ పరిస్థితుల నడుమ భవిష్యత్ యుద్ధాలు హెచ్చరికలకు పెద్దగా వ్యవధి ఉండని, స్వల్పకాలిక, మెరుపుదాడుల రూపంలో ఉంటాయన్నారు. 

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments