నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (08:43 IST)
దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న అన్‌లాక్-1 జూన్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో జూలై ఒకటో తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను కేంద్రం సోమవారం రాత్రి విడుదలచేసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న దానిపై  అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, నేటితో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు సంబంధించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
 
మరోవైపు, భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ ఉద్రిక్తతలు సద్దుమణిగేలా ఇరు దేశాల సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించిన చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments