Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

ఠాగూర్
శుక్రవారం, 9 మే 2025 (09:18 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం ముమ్మరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అపరకుబేరులుగా గుర్తింపు పొందిన దేశ దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు స్పందించారు. పాక్ యుద్ధం కారణంగా భారత్‌కు పూర్తి మద్దతుగా ఉంటామని ఇద్దరు ప్రకటించారు. దేశానికి ఏం కావాలన్నా తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.
 
'ఇలాంటి సమయంలోనే మన ఐక్యత, నిజమైన బలం బయటికొస్తుంది. మన మాతృభూమి ఆత్మను, మన ఆదర్శాల స్ఫూర్తిని కాపాడుకునేటప్పుడు మన సాయుధ దళాలకు మద్దతు ఇవ్వదానికి మేము అచంచలమైన సంఘీభావంతో నిలుస్తాము, దానికి కట్టుబడి ఉన్నాము. ఇండియా ఫస్ట్. జై హింద్!' అని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
 
'దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు ఏది కావాలన్నా ఇచ్చేందుకు మేము అన్ని వేళల సిద్ధంగా ఉంటాం. ఆపరేషన్ సిందూర్ కోసం మన భారత సాయుధ దళాలను చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో భారత సాయుధ దళాలు సరిహద్దు అవతల నుంచి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు ఖచ్చితత్వంతో ప్రతిస్పందించాయి. ఉగ్రవాదం నేపథ్యంలో భారతదేశం ఎప్పుడూ మౌనంగా ఉండదని, మన గడ్డపై, మన పౌరులపై ఒక్క దాడిని కూడా మనం సహించబోమని మోడీ నాయకత్వం నిరూపించింది.
 
గత కొన్ని రోజులుగా మన శాంతికి ఎదురయ్యే ప్రతి ముప్పును దృఢమైన, నిర్ణయాత్మక చర్యతో ఎదుర్కొంటామని చూపించాయి. రిలయన్స్ కుటుంబం మన దేశం యొక్క ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో ఏ చర్యకైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన తోటి భారతీయులు నమ్మినట్లుగా భారత్ శాంతిని కోరుకుంటుంది. కానీ దాని గర్వం, భద్రత లేదా సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టదు. కలిసి, మనం నిలబడతాం. మనం పోరాడుతాం. మనం గెలుస్తాం. జై హింద్! జై హింద్ కీ సేనా!" అని ముఖేశ్ అంబానీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments