Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం : హర్షవర్థన్

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (08:36 IST)
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ దేశ ప్రజలకు ఓ శుభవార్త చెప్పార. వచ్చేనెలలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆ తర్వాత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వచ్చేనెలలో ఏ దశలోనైనా, ఏ వారంలోనైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని, దేశ ప్రజలకు తొలి కొవిడ్‌ వ్యాక్సిన్‌ షాట్‌ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉండాలన్నారు. అయితే వ్యాక్సిన్‌ భద్రత, సమర్థత తమ మొదటి ప్రాధాన్యమని, ఈ విషయంలో రాజీపడే అవకాశమే లేదన్నారు. 
 
దేశంలో అత్యవసర వినియోగానికి కొన్ని వ్యాక్సిన్‌ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని, వాటిని డ్రగ్‌ రెగ్యులేటర్‌ విశ్లేషిస్తున్నారని చెప్పారు. అయితే వ్యాక్సిన్‌ పరిశోధనల విషయంలో భారత్‌ ఏ దేశానికి తీసిపోలేదన్నారు. 
 
టీకా సమర్థత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. దేశంలోని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు స్వదేశీ వ్యాక్సిన్‌పై పనిచేస్తున్నారని, వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో దేశంలో 30 కోట్లమందికి టీకాలు వేసే సామర్థ్యం తమకుంటుందని చెప్పారు. 
 
ప్రస్తుతం మన దేశంలో ఆరు కరోనా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని చెప్పారు. అందులో కొవీషీల్డ్‌, కోవాక్సిన్‌, జింకోవిడ్‌, స్పుత్నిక్‌ వీ, ఎన్‌వీఎక్స్‌-కోవ్‌2373 టీకాల పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

Dil Raju కార్యాలయాల్లో ఐటీ దాడుల్లోనూ అధికారులు తగ్గేదేలే, రహస్యమేమిటి?

ఛవా చిత్రంలో మహారాణి యేసుబాయి గా రశ్మిక మందన్నా

ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments