Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మహత్యల్లో డ్రాగన్ కంట్రీని అధికమించిన భారత్

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (10:14 IST)
మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య దేశంలో నానాటికీ పెరిగిపోతోంది. ఈ ఆత్మహత్యల్లో డ్రాగన్ కంట్రీని భారత్ అధికమించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య బీహార్ కంటే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
ఏపీ కంటే తెలంగాణాలోనే అధికంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏపీలో 15.3 శాతం సూసైడ్ చేసుకుంటుండగా, తెలంగాణాలో ఈ సంఖ్య 26.9 శాతంగా ఉంది. అయితే, దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యా కేసుల్లో 33.2 శాతం బలవన్మరణాలకు కుటుంబ సమస్యలే ప్రధాన కారణమని జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) పేర్కొంది. ఈ విషయం హైదరాబాద్ నగరంలో జరిగిన 9వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆసియన్ సైకియాట్రి సదస్సులో పాల్గొన్న నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ప్రతి యేడాది దేశ వ్యాప్తంగా 1.63 లక్షల మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే, వాస్తవ సంఖ్య మాత్రం 1.90 లక్షలకు పైమాటగానే వుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కానీ గ్లోబర్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ మాత్రం ఈ సంఖ్య 2.30 లక్షలుగా ఉంటుందని తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలేనని తేలింది. 
 
ప్రమాదకరమైన టీబీ, కేన్సర్ ‌కంటే ఆత్మహత్యల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని ఎన్.సి.ఆర్.బి. తెలిపింది. అయితే, అన్ని రంగాల్లో బాగా వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన బిహార్ రాష్ట్రంలో మాత్రం అతి తక్కువ సంఖ్య అంటే 0.70 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడినట్టు ఎన్సీఆర్బీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments