అవినీతిలో అగ్రస్థానంలో భారత్ ... పాకిస్థాన్‌ను మించిపోయింది..

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (06:46 IST)
అంతర్జాతీయంగా భారత్ అప్రతిష్టపాలైంది. మరో చెడ్డ పేరును ఆపాదించుకుంది. అవినీతిలో అగ్రస్థానం సంపాదించుకుంది. విచిత్రమేమిటంటే.. దాయాది దేశం పాకిస్థాన్ కంటే భారత్ అవినీతిలో తారస్థాయిలో ఉండటం గమనార్హం. ఆసియా ఖండంలోనే అత్యంత అవినీతి దేశాల్లో తొలి స్థానంలో భారత్ నిలిచింది. 
 
ఈ విషయాన్ని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెల్లడించింది. జర్మనీకి చెందిన ఈ సంస్థ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సంస్థ నివేదికను ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 69 శాతం అవినీతితో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 
 
కానీ, దాయాది దేశం పాకిస్థాన్ మనకంటే మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. పాకిస్థాన్‌లో 40 శాతం అవినీతి నమోదైంది. ఈ జాబితాలో 65 శాతం మంది లంచాలు తీసుకునేవారితో వియత్నాం రెండో స్థానంలో నిలిచింది. థాయిలాండ్‌లో 41 శాతం అవినీతి ఉన్నట్టు తేలింది. జపాన్ కేవలం 0.2 శాతం అవినీతితో చివరి స్థానంలో ఉంది.
 
ఇకపోతే, భారత్‌లో ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక సందర్భంలో లంచాలు ఇచ్చేవారేనని ఈ సర్వేలో తేలింది. ప్రాథమిక సౌకర్యాల కల్పనకు కూడా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి భారత్‌లో నెలకొందని పేర్కొంది. పబ్లిక్ స్కూల్స్, ఆసుపత్రుల్లో కూడా లంచాల బెడద తప్పడం లేదని వ్యాఖ్యానించింది. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments