Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అస్త్ర' క్షిపణిని పరీక్షించనున్న భారత్

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (21:09 IST)
Astra missile
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, గగనతలం నుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల 'అస్త్ర' క్షిపణిని భారత్‌ మరోసారి పరీక్షించనుంది. వైమానిక పోరాటంలో సరిహద్దు దేశాలు చైనా, పాకిస్థాన్‌లపై ఆధిపత్యం ప్రదర్శించే దిశగా రూపొందించిన 'అస్త్ర' మార్క్‌ 2 మిసైల్‌ను భారత్‌ పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్షిపణి 160 కిలో మీటర్ల లోపు దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 
 
అధునాతన అస్త్ర మార్క్‌ 2 గగనతల పోరాటంలో యుద్ధ విమానాలకు మరింత శక్తినిస్తుంది. తర్వాతి తరం క్షిపణి 'అస్త్ర' మార్క్‌ 2 వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని మాజీ సెంట్రల్‌ ఎయిర్‌ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌బీపీ సిన్హా(రిటైర్డ్‌) తెలిపారు. 
 
భారత వైమానిక దళం, నావికాదళం ఇప్పటికే 288 అస్త్ర మార్క్ -1 క్షిపణుల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. రష్యాకు చెందిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానాల నుంచి ఈ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments