Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు లడఖ్‌లో సర్వసన్నద్ధంగా ఇండియన్ వైమానికి దళం

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (15:54 IST)
తూర్పు లడఖ్‌ ప్రాంతంలో భారత వైమానికదళం సర్వ సన్నద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాలు గత నెల 15వ తేదీన భారత సైనికులపై దొంగచాటుగా దాడి చేసి 20 మందిని చంపేసిన విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 
 
ఈ సరిహద్దు ఉద్రిక్తత దృష్ట్యా భారత వైమానిక దళం సర్వ సన్నద్ధమైంది. ఫ్రంట్‌లైన్ జెట్లు, వైమానిక దాడిలో వినియోగించే హెలికాఫ్టర్లను, రవాణాకు సంబంధించిన విమానాలను వాస్తవ నియంత్రణ రేఖ వెంట గగనతలంలో కాపలాగా ఉంచుతోంది. 
 
రవాణాకు వినియోగించే అమెరికన్ సి-17 తో పాటు సి-130జె, రష్యాకు చెందిన ఇల్యూచిన్-76, ఆంటోనోవ్ -32 లాంటి వాటిల్లో దళాలను, సామాగ్రిని రవాణా చేయడానికి ఇప్పటికే వాయుసేన మోహరించింది. అపాచీ యుద్ధం విమానమైతే నిరంతరం గస్తీ కాస్తూనే ఉంది. 
 
ఈ స్థావరం మొత్తం కూడా కార్యకలాపాలను పర్యవేక్షించడం, జవాన్ల సంసిద్ధతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. 'ఈ ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహించడంలో ఈ స్థావరం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ స్థావరం ఎలాంటి ఆకస్మిక చర్యలను చేపట్టడానికైనా, పోరాటం చేయడానికైనా సర్వ సన్నద్ధంగా ఉంది' అని ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments