Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ నాపై కుట్రలు పన్నుతున్నారు

ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:24 IST)
ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. 
 
కానీ తన ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని మాత్రం ఆపలేదు. తన నియోజకవర్గంలో ప్రచారాన్ని యదావిధిగా కొనసాగించారు. ప్రచారం తర్వాతే ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. భావోద్వేగానికి లోనైయ్యారు. 
 
గతంలో తన కుమార్తె లగ్న పత్రిక రాసుకునే రోజునే తనను అరెస్ట్ చేసి మానసికంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేమో ఇలా ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరిపి దెబ్బతీయాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఢిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ (కేసీఆర్) ఇద్దరు కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారన్నారు. అయినప్పటికీ తాను భయపడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments