Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ నాపై కుట్రలు పన్నుతున్నారు

ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:24 IST)
ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. 
 
కానీ తన ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని మాత్రం ఆపలేదు. తన నియోజకవర్గంలో ప్రచారాన్ని యదావిధిగా కొనసాగించారు. ప్రచారం తర్వాతే ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. భావోద్వేగానికి లోనైయ్యారు. 
 
గతంలో తన కుమార్తె లగ్న పత్రిక రాసుకునే రోజునే తనను అరెస్ట్ చేసి మానసికంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేమో ఇలా ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరిపి దెబ్బతీయాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఢిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ (కేసీఆర్) ఇద్దరు కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారన్నారు. అయినప్పటికీ తాను భయపడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments