Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్ట‌ప‌ర్తిని ప్ర‌సాద్ స్కీంలో చేర్చండి...

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (11:42 IST)
అనంత‌పురం జిల్లాలో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయాల‌ని కేంద్ర మంత్రికి విజ్ణ్న‌ప్తులు చేరాయి. ఈ ప్రాంతాన్ని కేంద్రం ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన PRASAD ప‌థ‌కంలో చేర్చాల‌ని... పుట్ట‌ప‌ర్తిపై పూర్తి నివేదిక‌ను అందజేశారు.

ఢిల్లీ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ క‌లిశారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి ని PRASAD SCHEME  ద్వారా మరింత విసృత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ‌కు దీనిపై పూర్తి స్థాయి నివేదిక తో పాటు వినతి పత్రం సమర్పించారు. 
 
ఇప్ప‌టికే ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్ట‌ప‌ర్తి ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరొందింది. భ‌గ‌వాన్ గా వెలుగొందిన పుట్ట‌ప‌ర్తి  సత్యసాయి ప్రాభ‌వంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చేందింది. అయితే, ఆయ‌న మ‌ర‌ణానంత‌రం కొంత భ‌క్తుల తాకిడి త‌గ్గింది.

ఇక్క‌డి ప్ర‌శాంతి నిల‌యం కేంద్రంగా పుట్ట‌ప‌ర్తి ప్రాంతాన్ని మరింత పర్యాటక కేంద్రంగా, ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా టూరిజం శాఖ తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై స‌మ‌గ్ర నివేదిక‌ను స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కేంద్ర మంత్రికి అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments