చోరీ నుంచి తప్పించుకునేందుకు దుస్తులు విప్పేసి నగ్నంగా రోడ్డుపై కూర్చున్న మహిళలు.. ఎక్కడ?

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (15:37 IST)
ఓ దుకాణంలో చోరీ చేసిన మహిళలు... తమను పట్టుకునేందుకు వస్తున్న వారి చేతికి చిక్కకుండా ఉండేందుకు దుస్తులు విప్పేసి నగ్నంగా నడి రోడ్డుపై కూర్చొండిపోయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కరేలీబాగ్ సమీపంలోని అంబాలాల్ పార్క్‌‍లో ఇక్బాల్ ధోబీ లాండ్రీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నలుగురు మహిళలు షాపులోకి వచ్చి ఇక్బాల్‌ను మాటల్లో పెట్టి గల్లాపెట్టె నుంచి రూ.25 వేలు చోరీ చేసి పరారయ్యారు. ఆ తర్వాత చోరీని గుర్తించిన ఇక్బాల్ మరికొందరితో కలిసి మహిళలను వెంబడించారు.
 
తమను వెంబడిస్తున్న విషయాన్ని గుర్తించిన మహిళలు వారికి దొరక్కుండా ఉండేందుకు నడిరోడ్డుపై దుస్తులు విప్పి కూర్చుండిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అర్థనగ్నంగా రోడ్డుపై కూర్చున్న మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
మహిళలు మాత్రం తమను వెంబడించిన వారే దాడిచేసి దుస్తులు విప్పించి కూర్చోబెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే, పట్టుబడకుండా మహిళలు తమంత తామే దుస్తులు విప్పి కూర్చున్నారా? లేదంటే, నిజంగా వారిని వెంబడించిన వారే దుస్తులు విప్పించారా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
 
నిందితులైన మహిళల నుంచి రూ.9 వేలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారు తప్పించుకుని పరిగెత్తే క్రమంలో మిగతా సొమ్ము రోడ్డుపై ఉద్దేశపూర్వకంగా పడేసినట్టు పేర్కొన్నారు. వారు తమ పేర్లు, ఇతర వివరాలను వెల్లడించకపోవడంతో కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments