రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్లో ఆవులు, ఆంబోతులకు పెళ్లి జరిపించారు. మంగళవాయిద్యాల నడుమ వందలాది మంది నృత్యం చేస్తుండగా ఈ వివాహ ఘట్టాన్ని వేదమంత్రాల మధ్య పూజారులు పూర్తి చేశారు. దీంతో మొత్తం 40 ఆవుల
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్లో ఆవులు, ఆంబోతులకు పెళ్లి జరిపించారు. మంగళవాయిద్యాల నడుమ వందలాది మంది నృత్యం చేస్తుండగా ఈ వివాహ ఘట్టాన్ని వేదమంత్రాల మధ్య పూజారులు పూర్తి చేశారు. దీంతో మొత్తం 40 ఆవులు, ఆంబోతులు ఒక్కటయ్యాయి. ఎంతో వైభవంగా సాగిన ఈ ఆవుల వివాహాలకు అతిధులుగా షిల్లాంగ్, మేఘాలయ, ముంబై, ఢిల్లీ, చంఢీఘడ్ ప్రాంతాలనుంచే కాకుండా చుట్టుపక్కల పదిగ్రామాల ప్రజలు తరలివచ్చారు.
అతిథుల కోసం ప్రత్యేకంగా 200 కాటేజీలను ప్రత్యేకంగా నిర్మించారు. ఈ గోవుల వివాహ మహోత్సవానికి వచ్చిన వారినుంచి అందిన రూ.25 లక్షల విరాళాలతో ఆవుల షెల్టర్లను అభివృద్ధి చేస్తామని రాజేంద్రదాస్ అనే నిర్వాహకుడు చెప్పారు. ఈ పెళ్లి కోసం 40 ఎద్దులను ప్రత్యేకంగా పాత్ మేద గోశాల నుంచి రప్పించామని మరో నిర్వాహకుడు గోపేష్ చెప్పారు. హిందూమతంలో ఆవులకున్న విశిష్టతను గుర్తించి దేశవాళీ ఆవులు గర్భం దాల్చేందుకు వీలుగా ఎద్దులను తీసుకువచ్చి వివాహతంతు జరిపించామని నిర్వాహకులు చెప్పారు.