Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు హట్టాలో అడుగుపెడితే నిన్ను నేను చంపేస్తా- ఎఫ్‌బీలో ఎవరు ఎవరిని బెదిరించారు?

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. తన నియోజకవర్గంలోకి అడుగుపెడితే చంపేస్తానని కాంగ్రెస్ ఎంపీని బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు బెదిరింపులకు దిగడం ప్రస్తుతం చర్చనీ

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (13:14 IST)
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. తన నియోజకవర్గంలోకి అడుగుపెడితే చంపేస్తానని కాంగ్రెస్ ఎంపీని బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు బెదిరింపులకు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి హట్టా జిల్లాలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 
 
కానీ అయితే హట్టా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ఖటిక్‌ కుమారుడు ప్రిన్స్‌దీప్‌ లాల్‌చంద్‌ ఖటిక్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు ఫేస్ బుక్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. జ్యోతిరాదిత్య సింధియా ''ఎవరైతే ఝాన్సీ రాణిని చంపారో వారి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఒక వేళ నువ్వు హట్టాలో అడుగుపెడితే నిన్ను నేను చంపేస్తా'' అంటూ హెచ్చరించాడు. 
 
ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే రేపుతోంది. కానీ ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరమని.. సింధియా గౌరవించదగిన ఎంపీ అని.. ఆ పోస్ట్‌ను తొలగించమని తన కుమారుడికి చెబుతానని ఎమ్మెల్యే ఉమాదేవి ఖటిక్ తెలిపారు. 
 
మరోవైపు సింధియాకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని ఆ రాష్ట్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు రాజా పటేరియా ఆరోపించారు. ఇలాంటి పోస్టులను తీవ్రంగా పరిగణించి తక్షణమే విచారణ చేపట్టాలని, సింధియాకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

Rukmini Vasanth: ఎస్కే, రిషబ్, యష్, ఎన్టీఆర్‌తో రుక్మిణి వసంత్ సినిమాలు.. పాన్ ఇండియా హీరోయిన్‌గా?

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments