Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి ముఖర్జీయాతో కార్తీ చిదంబరం లింకు.... ఎలాంటి సంబంధమంటే?

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన తర్వాత ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జీయా భార్య ఇంద్రాణి ముఖర్జీయాతో చిదంబరం తనయుడు కార్తీ చిదంబ

Webdunia
బుధవారం, 17 మే 2017 (15:27 IST)
కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన తర్వాత ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జీయా భార్య ఇంద్రాణి ముఖర్జీయాతో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు ఆర్థిక సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 
 
చిదంబరంతో ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ మంగళవారం ఉదయం తనిఖీలు జరిపిన విషయం తెల్సిందే. ఓ మీడియా కంపెనీకి విదేశీ పెట్టుబడుల అనుమతుల మంజూరుకు సంబంధించిన వ్యవహారంలో కార్తీ చిదంబరం నిందితుడని ఎఫ్ఐఆర్ దాఖలైంది. 
 
కార్తీకి చెందిన సంస్థ 2008లో ఐ.ఎన్.ఎక్స్ మీడియా కంపెనీకి క్లియరెన్సులు అందడానికి అనువుగా వ్యవహరించిందన్నది ఆరోపణ. ఆ సమయంలో కార్తీ సంస్థ ఈ ఐ.ఎన్.ఎక్స్ మీడియా నుంచి రూ.10 లక్షల ముడుపులు అందుకున్నట్టు సమాచారం. 
 
ఈ కంపెనీ ఇంద్రాణీ ముఖర్జియా భర్త మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాకు చెందినది కావడం గమనార్హం. దీంతో ఇంద్రాణీతో కార్తీ చిదంబరం ఆర్థిక సంబంధాలు నెరిపినట్టు సమాచారం. ఈ డీల్ పూర్తి చేసేందుకు కార్తీ చిదంబరం భారీ మొత్తంలోనే ముడుపులు స్వీకరించినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments