Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగును 15 ముక్కలుగా కట్ చేశారు.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (21:06 IST)
ఏనుగు బురదలో కూరుకుని మృతి చెందింది. ఆలస్యంగా గుర్తించిన అధికారులు అతికష్టం మీద దాన్ని బయటకు తీశారు. తమిళనాడులోని నీలగిరిలోని మాళవన్ చేరంపాడిలో.. సుమారు పదిహేను వందల కిలోల అధిక బరువు ఉండడంతో అక్కడే ఖననం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఫారెస్ట్ అధికారులకు స్థానిక గ్రామస్థుల నుండి నిరసనలు ఎదురయ్యాయి. 
 
ఏనుగు ఖననం చేసే ప్రాంతంలో ఊరు ప్రజలు వాడుకునే మంచినీటి బావి ఉండడడంతో వారు వ్యతిరేకించారు.. ఏనుగును అక్కడే పూడ్చి పెట్టడడం వల్ల భవిష్యత్‌లో బావి నీళ్లు కలుషితం అవుతాయని చెప్పారు. 
 
దీంతో ఏనుగును అక్కడి నుండి తరలించి అటవీ ప్రాంతంలో ఖననం చేయాలని నిర్ణయించారు. అయితే అన్ని కిలోల బరువున్న ఏనుగును తరలించడం సాధ్యం కాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు.. దీంతో ఏనుగును కట్ చేసి విడివిడిగా మోసుకు పోవాలని నిర్ణయించారు. దీంతో చినిపోయిన ఏనుగును ముక్కలుగా కోశారు. ఇలా పదిహేను ముక్కలుగా ఏనుగును కత్తిరించి మూటల్లో తరలించారు.
 
అయితే ఇలా ఏనుగును ముక్కలుగా కట్ చేసి తరలించడం మొదటి సారి అని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ మారడంతో పలువురు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments