ఏనుగును 15 ముక్కలుగా కట్ చేశారు.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (21:06 IST)
ఏనుగు బురదలో కూరుకుని మృతి చెందింది. ఆలస్యంగా గుర్తించిన అధికారులు అతికష్టం మీద దాన్ని బయటకు తీశారు. తమిళనాడులోని నీలగిరిలోని మాళవన్ చేరంపాడిలో.. సుమారు పదిహేను వందల కిలోల అధిక బరువు ఉండడంతో అక్కడే ఖననం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఫారెస్ట్ అధికారులకు స్థానిక గ్రామస్థుల నుండి నిరసనలు ఎదురయ్యాయి. 
 
ఏనుగు ఖననం చేసే ప్రాంతంలో ఊరు ప్రజలు వాడుకునే మంచినీటి బావి ఉండడడంతో వారు వ్యతిరేకించారు.. ఏనుగును అక్కడే పూడ్చి పెట్టడడం వల్ల భవిష్యత్‌లో బావి నీళ్లు కలుషితం అవుతాయని చెప్పారు. 
 
దీంతో ఏనుగును అక్కడి నుండి తరలించి అటవీ ప్రాంతంలో ఖననం చేయాలని నిర్ణయించారు. అయితే అన్ని కిలోల బరువున్న ఏనుగును తరలించడం సాధ్యం కాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు.. దీంతో ఏనుగును కట్ చేసి విడివిడిగా మోసుకు పోవాలని నిర్ణయించారు. దీంతో చినిపోయిన ఏనుగును ముక్కలుగా కోశారు. ఇలా పదిహేను ముక్కలుగా ఏనుగును కత్తిరించి మూటల్లో తరలించారు.
 
అయితే ఇలా ఏనుగును ముక్కలుగా కట్ చేసి తరలించడం మొదటి సారి అని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ మారడంతో పలువురు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments