Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ షేర్ చేస్తే భారీ జరిమానా, ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (12:43 IST)
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి కేంద్రం కళ్ళెం వేయనుంది. ఇలాంటి వారిని కట్టడిచేసేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నిబంధనల మేరకు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే రూ.10 ల7ల మేరకు అపరాధం విధించనుంది. ఈ కొత్త మార్గదర్శకాలను పదేపదే ఉల్లంఘిస్తే మాత్రం ఈ అపరాధం రూ.50 లక్షలకు చేరనుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేవారిని రక్షించడమే లక్ష్యంగా ఈ కొత్త మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసింది. వీటిని మరో 15 రోజుల్లో అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
బ్రాండ్లను ఎండార్స్ చేసే సెలెబ్రిటీలు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 15 రోజుల్లో ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) పేరిట విడుదల చేయనుంది. 
 
తప్పుదోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజలను రక్షించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బ్రాండ్‌ను ఎండార్స్ చేసేవారు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, బ్లాగర్లను దీనికిందకు తీసుకురానుంది. అంతేకాదు, వస్తువులను ఉచితంగా తీసుకుని వాటిని ప్రచారం చేసేవారు, పొందిన వస్తువులకు ముందుగా 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకున్న వస్తువులను మళ్లీ తిరిగి వారికి అప్పగిస్తే కనుక సెక్షన్ 194 కింద ఆ మొత్తాన్ని తిరిగి పొందొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments