Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే...తొమ్మిది లక్షలు మాయం

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (06:53 IST)
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఆన్‌లైన్‌ మోసాలకు అదుపు లేకుండా పోయింది. ఒక్క ఫోన్‌ కాల్‌తో డబ్బులు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. అలా ఏకంగా కుమారుడు చేసిన పనికి తొమ్మిది లక్షల రూపాయలను స్మార్ట్‌ మోసగాళ్లకు అర్పణం చేశాడు నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరాడి ప్రాంతానికి చెందిన అశోక్‌ మాన్వాతే ఫోన్‌ను కుమారుడు వినియోగిస్తున్నాడు. అంతలో ఒక అపరిచితుల నుండి ఆ ఫోన్‌కు కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వారు..తమను తాము డిజిటల్‌ పేమేంట్స్‌ కంపెనీకి చెందిన కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకుని, డిజిల్‌ చెల్లింపు ఖాతాల పరిధిని పెంచుతానని, అందుకు ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలంటూ సూచించాడు.

దీంతో ఆ యువకుడు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో..ఒక్కసారిగా తన తండ్రి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.8.95 లక్షల రూపాయలను మాయం చేశారు. దీంతో ఖంగుతిన్న కుమారుడు..తండ్రికి చెప్పడంతో...ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపిసి 419, 420 సెక్షన్‌లతో పాటు ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments