Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్‌పై సామూహిక అత్యాచారం..

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (17:24 IST)
భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి. మృగాళ్లు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చివరకు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగిని కూడా విడిచిపెట్టలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ దారణమైన ఘటన చోటుచేసుకుంది.


మీరట్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మహిళ (29) పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ ఈ దారుణానికి ఒడికట్టడం కలకలం రేపింది. కాగా నిందితుల్లో డాక్టరు కూడా ఉండడం మరింత ఆందోళన కలిగించే విషయం. శనివారం రాత్రి ఈ దారణమైన ఘటన జరిగింది.
 
పోలీసుల కథనం మేరకు బాధిత మహిళ శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిందని, ఆ తర్వాత పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆమెను జాగ్రత్తగా కాపాడాల్సిన హాస్పిటల్ సిబ్బంది ఆమెపై ఈ నీచానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసామని, దర్యాప్తును చేపట్టామని సీనియర్ అధికారి హరిమోహన్‌ సింగ్‌ తెలిపారు. ముందస్తుగా ఓ పథకాన్ని రచించి, దాని ప్రకారం మత్తు ఇంజక్షన్ ఇచ్చి, అలాగే సీసీటీవీని ఆఫ్ చేసి అత్యాచారనికి ఒడిగట్టారని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందం ఒక మహిళతో పాటు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణను వేగవంతం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments