Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్‌పై సామూహిక అత్యాచారం..

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (17:24 IST)
భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి. మృగాళ్లు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చివరకు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగిని కూడా విడిచిపెట్టలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ దారణమైన ఘటన చోటుచేసుకుంది.


మీరట్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మహిళ (29) పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ ఈ దారుణానికి ఒడికట్టడం కలకలం రేపింది. కాగా నిందితుల్లో డాక్టరు కూడా ఉండడం మరింత ఆందోళన కలిగించే విషయం. శనివారం రాత్రి ఈ దారణమైన ఘటన జరిగింది.
 
పోలీసుల కథనం మేరకు బాధిత మహిళ శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిందని, ఆ తర్వాత పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆమెను జాగ్రత్తగా కాపాడాల్సిన హాస్పిటల్ సిబ్బంది ఆమెపై ఈ నీచానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసామని, దర్యాప్తును చేపట్టామని సీనియర్ అధికారి హరిమోహన్‌ సింగ్‌ తెలిపారు. ముందస్తుగా ఓ పథకాన్ని రచించి, దాని ప్రకారం మత్తు ఇంజక్షన్ ఇచ్చి, అలాగే సీసీటీవీని ఆఫ్ చేసి అత్యాచారనికి ఒడిగట్టారని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందం ఒక మహిళతో పాటు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణను వేగవంతం చేసారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments