Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఐఏఎస్ చంద్రకళకు మోడీ డ్రీమ్ టీమ్‌లో చోటు.. స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్‌గా..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ చంద్రకళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ టీమ్‌లో ఆమెకు స్థానం లభించింది. ప్రధాన మంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (16:22 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ చంద్రకళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ టీమ్‌లో ఆమెకు స్థానం లభించింది. ప్రధాన మంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు ఐఏఎస్ ఆఫీసర్ అయిన చంద్రకళను డైరక్టర్‌గా నియమించారు.

ఇంకా మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ శాఖలోనే ఆమెకు ఉప కార్యదర్శి పగ్గాలు అప్పగించారు. ఇటీవల బులందర్‌షెహర్, బిజ్నూర్, మీరట్ నగరాల్లో క్లీన్ ఇండియా ప్రచారాన్ని ఆమె విజయవంతంగా నిర్వహించారు. అందుకే ఆమె మోడీ కంటపడ్డారు. 
 
ఇంతేగాకుండా.. అక్రమార్కుల భరతం పడుతూ.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న ఈమె.. యూపీలోని మీరట్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌గానూ ఈమెను ఫైర్ బ్రాండ్ ఉంది. 2008వ బ్యాచ్‌కు చెందిన యూపీ క్యాడర్ ఆఫీసర్ రెండేళ్ల క్రితం.. నాసిరకం రోడ్లేసిన అధికారులపై ఫైర్ అయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పటి నుంచి ఈమెకు నెటిజన్లతో పాటు ప్రజల సపోర్ట్ వుంది. అంతేగాకుండా ఈమె ఇప్పటికే అత్యుత్తమ ఐఏఎస్ ఆఫీసర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments