Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరత గడ్డపై అడుగుపెట్టనున్న అభినందన్... వాఘా బోర్డర్‌ వద్ద భావోద్వేగ వాతావరణం

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (09:49 IST)
భారత భూభాగంలోకి వచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెంబడించి, ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసిన తర్వాత ప్రమాదశాత్తు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భరతమాత గడ్డపై  అడుగుపెట్టనున్నాడు. 
 
తమ వద్ద బందీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేసేందుకు పాకిస్థాన్ గురువారం సమ్మతించిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో పాటు.. భారత దౌత్య నీతికి పాకిస్థాన్ తలొగ్గక తప్పలేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన ఈ ప్రకటనతో భారతదేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.
 
మరోవైపు, అభినందన్ భార్యాపిల్లలు ఢిల్లీలో ఉంటే.. ఆయన తల్లిదండ్రులు మాత్రం చెన్నై తాంబరం ఎయిర్‌ఫోర్స్ క్వార్టర్స్‌లో నివశిస్తోంది. దీంతో తమ బిడ్డను చూసేందుకు అభినందన్ తండ్రి సింహుకుట్టి వర్ధమాన్, తల్లి శోభలు, మరికొంతమంది బంధువులు గురువారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే, పాక్ చెర నుంచి విడుదల కాబోతున్న అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెట్టు పేరు, జాతి చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదు.. మంచు మనోజ్

BoycottLaila వద్దు welcome Lailaను ఆదరించండి.. పృథ్వీరాజ్ క్షమాపణలు

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments