Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ యేడాది పాలనకు -0 మార్కులే : లాలూ ప్రసాద్

Webdunia
గురువారం, 21 మే 2015 (14:10 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి యేడాది పాలనపై మైనస్ సున్నా మార్కులు వేస్తానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఈ యేడాది కాలంలో నరేంద్ర మోడీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా.. రైతులను ఆదుకోవడంలోనూ, యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందన్నారు.
 
ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి తానైతే సున్నా కంటే తక్కువ మార్కులు ఇస్తానన్నారు. దేశంలో పంట నష్టపోయిన బాధిత రైతులకు సహాయం చేయడం, యువతకు ఉద్యోగం కల్పించడంలో విఫలమయ్యారన్నారు. అంతేగాక విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకుని రావడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. 
 
జనతా పరివార్‌లో ఆరు పార్టీల విలీనంపై ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, జేడీయూ అధినేత శరద్ యాదవ్‌తో సమావేశమయ్యేందుకు ఢిల్లీ వెళుతున్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఎయిర్‌‍పోర్టులో మీడియాతో పైవిధంగా మాట్లాడారు. 
 
కాగా, ఇటీవల మోడీ యేడాది పాలనపై స్పందించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మోడీ పాలనకు తాను పదికి సున్నా మార్కులే ఇస్తానంటూ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తమ సర్కారుకు మార్కులు ఇవ్వడానికి ఆయన ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments