Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్

‘వింత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీస్ దినోత్సవం సందర్భంగా త్రిపుర రాజధాని

Webdunia
బుధవారం, 2 మే 2018 (21:17 IST)
వింత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే  త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తానంటూ షాకింగ్  కామెంట్స్ చేశారు. పోలీస్ దినోత్సవం సందర్భంగా త్రిపుర రాజధాని అగర్తలాలో నిర్వహించిన కార్యక్రమంలో బిప్లబ్‌ మాట్లాడుతూ.. ‘ఎవ్వరూ నా ప్రభుత్వంపై చెయ్యి వేయలేరు. ఎందుకంటే  ప్రభుత్వం నాది కాదు. ప్రజలది. 
 
నా ప్రజలు, ప్రభుత్వంపై చెయ్యి ఎత్తే ధైర్యం చేస్తే గోళ్లు కత్తిరించేస్తా’ అని వ్యాఖ్యానించారు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్ద సొరకాయలు ఉంటే కొనడానికి వచ్చేవారంతా అది బాగానే ఉందా? లేదా? అని పరీక్షించేందుకు గోళ్లతో గిల్లి చూస్తారు. అలా చాలామంది చేయడం వల్ల సొరకాయపై గాట్లు పడి ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఇక దాన్ని ఎవ్వరూ కొనుక్కోరు. సొరకాయ మాదిరిగా నా ప్రభుత్వంపై ఎవ్వరైనా గాట్లు పెడదామని చూస్తే... చూస్తూ ఊరుకోను. వాళ్ల  గోళ్లు కత్తిరించేస్తాను’ అంటూ మరో వివాదంలో ఇరుక్కున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments