Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్ డ్రైవర్ ఎంత పని చేశాడు.. నవ దంపతులను పొట్టనబెట్టుకున్నాడు..

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (12:32 IST)
ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ సెల్‌ఫోన్ వాడుతూ.. డ్రైవింగ్ చేసిన కారణంగా.. నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. సెల్‌ఫోన్ వాడుతూ బండిని నడిపిన కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు ఏపీ 29 జడ్ 2157 నెంబర్ గల తెలంగాణ ఆర్టీసీ బస్సు వెళ్తోంది.
 
ఇటీవలే ప్రేమించి వివాహం చేసుకున్న రాజమండ్రికి చెందిన కోటేశ్వర రావు (29), స్వప్న (27) దంపతులు తమ వాహనంపై అదే రూట్లో వస్తున్నారు. కానీ సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ.. బస్సును నడిపిన డ్రైవర్ టీవీ రెడ్డి, బస్సును అదుపు చేయలేక, డివైడర్‌ పైకి ఎక్కించాడు. అది పక్కనే వెళ్తున్న కోటేశ్వరరావు దంపతుల పైకి దూసుకెళ్లింది. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. లొంగిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments