Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు వారసులున్నారుగా.. దీప, దీపక్‌ల సంగతేంటి? హైదరాబాద్ ఆస్తులపై హైకోర్టు సీరియస్

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వారసులు లేకపోవడంతో హైదరాబాదులోని అమ్మ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని ఓ పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, జయలలితకు హైదరాబాద్‌లోని జ

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (11:50 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వారసులు లేకపోవడంతో హైదరాబాదులోని అమ్మ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని ఓ పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, జయలలితకు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఫాంహౌస్‌, శ్రీనగర్‌ కాలనీలో బహుళ అంతస్థుల భవనం ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వారసులు లేని కారణంగా జయమ్మ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని గరీబ్‌గైడ్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అంతేకాదు ఇలాంటి పిటిషన్ వేసినందుకు సదరు వ్యక్తికి ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది హైదరాబాద్ హైకోర్టు. జయలలిత మరణించి 15 రోజులు కూడా గడవకముందే ఇలాంటి పిటిషన్లు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, జయకు సోదరుడు ఉన్నందున ఆమెకు వారసులు లేరని ఎలా అంటారని హైకోర్టు ప్రశ్నించింది. జయ సోదరుడికి ఒక కొడుకు, ఒక కూతురు ఉందని పేర్కొన్న హైకోర్టు.. హిందూ చట్టం ప్రకారం ఆమె ఆస్తులు వారికే చెందుతాయని స్పష్టం చేసింది.
 
నాలుగు వారాల్లోగా జరిమానా చెల్లించాలని తీర్పు చెబుతూ పిటిషన్ కొట్టివేసింది. జరిమానా చెల్లించకుంటే తెలంగాణ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇలాంటి పిటిషన్లు వేయడం వల్ల కోర్టు సమయం వృదా అవుతోందని, గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని హైకోర్టు ఫైర్ అయ్యింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments