Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం యాసిడ్ పోశారు.. భర్తతో పాటు అత్తింటి వారంతా కలిసి..?

మహిళలపై ఓ వైపు లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే మరోవైపు వరకట్నం వేధింపులు కూడా కొనసాగుతూనే వున్నాయి. తాజాగా యూపీలో అదనపు కట్నం కోసం అత్తింటివారు వివాహితపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (17:23 IST)
మహిళలపై ఓ వైపు లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే మరోవైపు వరకట్నం వేధింపులు కూడా కొనసాగుతూనే వున్నాయి. తాజాగా యూపీలో అదనపు కట్నం కోసం అత్తింటివారు వివాహితపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాంబాల్ జిల్లా కొత్వాలిలో దారుణం జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. కొత్వాలి గ్రామానికి చెందిన ఫర్జానాకు అక్రం అనే వ్యక్తితో ఏడాదిన్నర క్రితం పెళ్లైంది. ఈ మధ్యకాలంలో కారు, డబ్బు తేవాలని ఫర్జానాను భర్త, అత్త, మామలు వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం ఆమె భర్త, అత్త, మామ, ఆడపడుచు, మరిది కలిసి ఆమెపై యాసిడ్ పోశారు. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఫర్జానాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 25 ఏళ్ల తన బిడ్డను కట్నం కోసం తరచూ వేధిస్తూ ఉండేవారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం