Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో మందుబాబులుగా మారిన ఎలుకలు.. సీసాలు సీసాలు తాగేశాయట..!

బీహార్‌లో మద్యంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ అధికారం చేపట్టగానే మద్యంపై నిషేధం విధించారు. అయితే ఇటీవల బీహార్ రాజధాని పాట్నాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు

Webdunia
గురువారం, 4 మే 2017 (14:09 IST)
బీహార్‌లో మద్యంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ అధికారం చేపట్టగానే మద్యంపై నిషేధం విధించారు. అయితే ఇటీవల బీహార్ రాజధాని పాట్నాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సరుకును పోలీస్ స్టోర్ రూమ్స్‌లో పెట్టారు. కానీ ఈ మద్యం మాత్రం ఒకటి తర్వాత ఒకటి ఖాళీ అయిపోతూ వచ్చాయి. అయితే ఈ మందును రుచి చూసింది పోలీసులేనని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. ఇక పాట్నా ఏఎస్పీ మను మహరాజ్ మద్యంపై కన్నేశారు. 
 
ఆ గదులకు కాపలా కాస్తున్న సిబ్బందికి బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు చేయించారు. ఒక్కరూ పట్టుబడలేదు. ఈ క్రమంలో టెస్టుకు ఓ కానిస్టేబుల్ అంగీకరించకపోవడంతో ఆయన్ని పదవి నుంచి తొలగించారు. కానీ, మద్యం సీసాలను ఎవరు ఖాళీ చేస్తున్నారనే విషయం మాత్రం తేలలేదు. చివరికి అసలు విషయం తెలియవచ్చింది. తీవ్రంగా చేసిన దర్యాప్తులో మందు సీసాలు ఎలుకలే ఖాళీ చేస్తున్నట్లు తేలింది. 
 
పోలీస్ స్టోర్ రూమ్స్ నిండా విపరీతమైన ఎలుకలు ఉండటంతో.. మద్యం సీసాల మూతలను కొంచెం కొంచెంగా కొరికేసి మందు కొట్టేస్తున్నాయని తేలింది. ఒకటో రెండో మద్యం బాటిల్స్ కాదు.. ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని ఎంచక్కా ఎలుకలు తాగేశాయని తేలింది. దీంతో, పోలీసు సిబ్బందితో సమావేశమైన మహారాజ్ స్టోర్ రూమ్‌లో ఎలుకలు లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదన్నమాట మందు తాగే ఎలుకల కథ.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments