బీహార్ శాసనసభలో పార్టీల బలాబలాలు ఎంత?

వరుణ్
ఆదివారం, 28 జనవరి 2024 (16:24 IST)
బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. గత ఎన్నికల్లో రెండు అతిపెద్ద పార్టీలుగా అవతరించిన ఆర్జీడీ, బీజేపీలతో జేడీయూ నేత కర్చీలాట ఆడుతున్నారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత తొలుత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీని పక్కనబెట్టి.. ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇపుడు ఆర్జేడీకి కాదని మళ్లీ బీజేపీతో చేతులు కలిపి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్ర శాసనసభలో పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, 
 
మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ శాసనసభలో గత ఎన్నికల్లో 79 సీట్లను గెలుచుకున్న ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 78, జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు, సీపీఐ ఎంఎల్‌కు 12, హిందుస్థానీ ఆవాం మోర్చా సెక్యులర్ పార్టీకి నాలుగు, సీపీఐ రెండు, సీపీఎం రెండు, ఎంఐఎం ఒక చోటు గెలుపొందాయి. ఒక చోట మాత్రం స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 
 
అయితే, ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ సాధించిన సీట్లు కేవలం 45 మాత్రమే. కానీ, ఆయన చక్రం తిప్పుతూ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు కావాలి. కానీ, బీజేపీకి 78, జేడీయూకు 45 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు... కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబెల్స్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీశ్ కుమార్ సిద్ధమయ్యారు. ఇ్పటికే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన కొత్త ప్రభుత్వాన్ని నేడో రేపో ఏర్పాటు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్

Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments