Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడిని ప్రేమించిన కుమార్తె.. చంపేసిన కన్నతండ్రి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:04 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మనసుకు నచ్చిన యువకుడిని ప్రేమించిన కుమార్తెతో ఆమె ప్రియుడిని కూడా కన్నతండ్రి కర్కశంగా చంపేశాడు. ఈ పరువు హత్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేన్ జిల్లా రతన్ బసాయి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన శివాణి (18) అనే యువతి సమీప గ్రామానికి చెందిన రాధేశ్యామ్ తోమర్ (21) అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తుంది. ఈ విషయం శివాణి తండ్రి రాజ్‌పాల్‌కి తెలిసింది. అంతే.. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా కర్కశంగా చంపేశాడు. మృతదేహాలను ఎవరికీ కనిపించకుండా చంబాల్ నదిలో పడేశాడు. ఆ తర్వాత జూన్ మూడో తేదీన తమ కుమార్తె కనిపించలేదంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. 
 
తండ్రి మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉండిపోయాడు. దీంతో అనుమానం వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించాడు. పైగా, మృతదేహాలు పడేసిన ప్రాంతాన్ని కూడా చూపించాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments