Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడిని ప్రేమించిన కుమార్తె.. చంపేసిన కన్నతండ్రి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:04 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మనసుకు నచ్చిన యువకుడిని ప్రేమించిన కుమార్తెతో ఆమె ప్రియుడిని కూడా కన్నతండ్రి కర్కశంగా చంపేశాడు. ఈ పరువు హత్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేన్ జిల్లా రతన్ బసాయి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన శివాణి (18) అనే యువతి సమీప గ్రామానికి చెందిన రాధేశ్యామ్ తోమర్ (21) అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తుంది. ఈ విషయం శివాణి తండ్రి రాజ్‌పాల్‌కి తెలిసింది. అంతే.. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా కర్కశంగా చంపేశాడు. మృతదేహాలను ఎవరికీ కనిపించకుండా చంబాల్ నదిలో పడేశాడు. ఆ తర్వాత జూన్ మూడో తేదీన తమ కుమార్తె కనిపించలేదంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. 
 
తండ్రి మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉండిపోయాడు. దీంతో అనుమానం వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించాడు. పైగా, మృతదేహాలు పడేసిన ప్రాంతాన్ని కూడా చూపించాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments