Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందనీ... సోదరినీ మట్టుబెట్టిన అన్నలు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (17:46 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తోడబుట్టిన చెల్లిని ముగ్గురు అన్నలు కలిసి హత్య చేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్‌పురి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అంగోత గ్రామానికి చెందిన జ్యోతి మిశ్రా.. మ‌రో గ్రామ యువ‌కుడైన రోహిత్ యాద‌వ్‌ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి కులాలు వేరు. ముఖ్యంగా వధువు ఉన్నత కులస్థురాలు కాగా, వరుడు తక్కువ కులస్థుడు. దీంతో వీరి ప్రేమ వివాహానికి వధువు తరపు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. 
 
ఈ వివాహం వల్ల తమ పరువు పోయిందని భావించిన వధువు అన్నలు.. ఆమెపై పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశారు. తక్కువ కులం యవకుడితో తమ చెల్లి కలిసి కాపురం చేయడం అస్సలు ఇష్టంలేని జ్యోతి సోదరుల‌ు... అదును చూసి దెబ్బ కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 
 
దీంతో ఇటీవ‌లే జ్యోతిపై ఆమె సోద‌రులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ప్రాణాలు కోల్పోయింది. రోహిత్ మాత్రం తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments