పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. మాస్కులు ధరించాలా? వద్దా? కర్నాటక అడ్వైజరీ

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (09:41 IST)
చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడించింది. 2019లో వెలుగు చూసిన కరోనా వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు అలాంటి వైరస్ ఒకటి చైనాలో పుట్టింది. ఈ వైరస్ ఇప్పటికే చైనాలో తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇపుడు భారత్‌లోకి ప్రవేశించింది. దేశ వ్యాప్తంగా ఐదు కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో రెండు, తమిళనాడులో రెండు, గుజరాత్‌లో ఒకటి చొప్పున మొత్తం ఐదు కేసులు నమోదైవున్నాయి. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ప్రజలను అలెర్ట్ చేసింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించింది. 
 
అయితే, హెచ్ఎంపీవీ వైరస్ కోవిడ్-19లా వ్యాప్తి చెందేది కాదని, కాబట్టి ఎవరూ భయపడవద్దని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అడ్వైజరీని విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించింది.
 
ఇది శ్వాసకోశ సంబంధిత వైరస్ అని వెల్లడించింది. ఈ వైరస్ ప్రాథమికంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని, వారిలో సాధారణ జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అడ్వైజరీలో పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజాలాంటి అనారోగ్యం, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వంటి కేసులను రిపోర్ట్ చేయాలని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
 
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కూడా సూచనలు చేసింది. ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మిన సమయంలో నోరు, ముక్కును కప్పి ఉంచుకోవాలని, తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సూచించింది. హెచ్ఎంపీవీ లక్షణాలు కలిగిన వారు, రోగులకు సన్నిహితంగా ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఉపయోగించిన టిష్యూ పేపర్లను మరలా వాడవద్దని, తవ్వాలు లేదా హ్యాండ్ కర్చీఫ్ ఒకరికి మించి ఉపయోగించవద్దని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దని విజ్ఞప్తి చేసింది.
 
హెచ్ఎంపీవీ సోకితే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఫ్లూలాంటి లక్షణాలు కనబడతాయని వెల్లడించింది. మరింత తీవ్రమైన కేసుల్లో అయితే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారిలో ఇది బ్రాంకైటిస్, నిమోనియాకు దారి తీసే అవకాశముందని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ప్రస్తుతానికి హెచ్ఎంపీవీకి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్స, వ్యాక్సిన్ లేవని తెలిపింది. తగిన విశ్రాంతి తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వంటి చర్యలతో ఉపశమనం ఉంటుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments