Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మవారి విగ్రహాన్ని ముక్కలుగా చేసి, విగ్రహం తలను..?

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (17:48 IST)
పశ్చిమ బంగ్లాదేశ్‌లోని జెనైదా జిల్లాలోని దౌతియా గ్రామంలో పురాతన కాళీమాత ఆలయంపై దాడి జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని ముక్కలుగా చేసి, విగ్రహం తలను తీసుకుని ఆలయ ప్రాంగణం నుండి అర కిలోమీటరు దూరంలో ఉన్న రహదారిపై పడవేశారని ఆలయ కమిటీ అధ్యక్షుడు సుకుమార్ చెప్పారు.
 
కాళీ దేవాలయం అఖండ భారత దేశంగా ఉన్నప్పటి నుంచి హిందువుల ప్రార్థనా స్థలం. ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. 
 
మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలను విజయదశమి రోజున వివిధ నదుల్లో నిమజ్జనం చేశారు. జెనైదాలోని ఆలయంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని బంగ్లాదేశ్ పూజా సెలబ్రేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి చందనాథ్ పొద్దార్ తెలిపారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు జెనైదా పోలీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ బర్మన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments