Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

సెల్వి
శనివారం, 5 జులై 2025 (09:26 IST)
హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఒక నెల వ్యవధిలో, ఈ రెండు ఉత్తర పర్వత రాష్ట్రాలలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాలతో ఆకస్మిక వరదలు, ప్రాణాంతక కొండచరియలు విరిగిపడటంతో విషాదకరమైన రోడ్డు ప్రమాదాలకు దారితీసింది. జూన్ 1 నుండి ఉత్తరాఖండ్‌లో 70 మరణాలు నమోదయ్యాయని, ప్రకృతి వైపరీత్యాలలో 20 మంది మరణించారని, రోడ్డు ప్రమాదాలలో మరో 50 మంది మరణించారని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ (SEOC) విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
 
ఉత్తరకాశీలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్, రుద్రప్రయాగ్‌లలో రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికం.
 
Floods
రుద్రప్రయాగ్‌లోని అలకనంద నది 20 మీటర్లకు పైగా ఉప్పొంగి, ఘాట్‌లు, మార్గాలు, బెల్ని వంతెన సమీపంలో 15 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని కూడా నీట మునిగింది.
 
మందాకిని వంటి ఉపనదులు కూడా ప్రమాదకరంగా ఉప్పొంగుతున్నాయి, అధికారుల నుండి అత్యవసర హెచ్చరికలు వచ్చాయి. రెస్క్యూ బృందాలు హై అలర్ట్‌లో ఉన్నందున నివాసితులు నదీ తీరాలకు దూరంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments