గోవుకు గౌరవం : హిమాచల్ రాష్ట్ర మాతగా ఆవు

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (12:37 IST)
గోవుకు గౌరవం దక్కింది. రాష్ట్ర మాతగా ఆవును ఎంపిక చేశారు. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. 
 
దేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో గోసంరక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గోవును రాష్ట్ర మాతగా ప్రకటించారు. గోవు పాలు ఇవ్వడం మానెయ్యగానే దాన్ని వధించడం ఆపాలని శాసనసభ్యులంతా ముక్తకంఠంతో కోరారు. దీంతో ఆవును రాష్ట్ర మాతగా ప్రకటించి కేంద్రానికి తెలిపారు. 
 
ఇకపోతే, ఆవుల సంరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఇప్పటికే, సిర్మావూరు జిల్లాలో రూ.1.52 కోట్లతో ఆవుల కోసం ప్రత్యేకంగా అభయారణ్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వీరేందర్ కన్వర్ వెల్లడించారు. 
 
అలాగే, సోలన్, కాంగ్రా జిల్లాల్లోనూ ఆవుల అభయారణ్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గౌరి పేరిట లోకల్ ఆవుల బ్రీడ్‌ను ప్రోత్సహించాలని సూచించారు ఎమ్మెల్యేలు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు రాజస్థాన్ రాష్ట్రం కూడా ఆవుల పరిరక్షణకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం