Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హిజాబ్‌ వివాదంపై కర్నాటక కోర్టు కీలక తీర్పు

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (08:13 IST)
దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, తీర్పుతో నిమిత్తం లేకుండా ఇరు వర్గాలను అదుపు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గట్టి బందోబస్తును ఏర్పాటుచేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసు బగాలను మొహరించింది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే పలు ఆంక్షలను అమల్లోకి వచ్చేశాయి. 
 
మరోవైపు, హిజాబ్ వివాదం రేగిన దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా మంగళవారం అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం జరుగనున్న పరీక్షలను కూడా వాయిదా వేసుకోవాలని అన్ని విద్యా సంస్థలను ఆయన కోరారు. 
 
మరోవైపు, హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగుళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఒక వారం రోజుల పాటు బెంగుళూరు నగరంలో ఎలాంటి సమావేశాలుగానీ, నిరసనలు గానీ, జనం గుమికూడటానికిగానీ అనుమతించబోమని ఓ ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments