Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.. ఆపై హత్య కూడా..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (10:30 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో చెప్పారు. వివరాల్లోకి వెళితే, మీరట్‌కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్‌ స్నేహితులు. వారం క్రితం వీరు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆపై హత్యచేశారు. బాలిక మృతదేహాన్ని నోయిడాలోని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాత్రి పూట మద్యం తాగుతూ సినిమా చూశామని.. ఆపై సరదాగా కారులో వెళ్తూ కిడ్నాప్ చేయాలనుకుని రోడ్డుపైకి వచ్చామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. 
 
ఆ సమయంలో బాలిక ఒంటరిగా వెళ్తూ కనిపించడంతో ఆమెను కారులో ఎక్కించుకుని.. సామూహికంగా అత్యాచారానికి పాల్పడి చంపేశామని నిందితులు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments