Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.. ఆపై హత్య కూడా..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (10:30 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో చెప్పారు. వివరాల్లోకి వెళితే, మీరట్‌కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్‌ స్నేహితులు. వారం క్రితం వీరు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆపై హత్యచేశారు. బాలిక మృతదేహాన్ని నోయిడాలోని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాత్రి పూట మద్యం తాగుతూ సినిమా చూశామని.. ఆపై సరదాగా కారులో వెళ్తూ కిడ్నాప్ చేయాలనుకుని రోడ్డుపైకి వచ్చామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. 
 
ఆ సమయంలో బాలిక ఒంటరిగా వెళ్తూ కనిపించడంతో ఆమెను కారులో ఎక్కించుకుని.. సామూహికంగా అత్యాచారానికి పాల్పడి చంపేశామని నిందితులు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments