Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో భారీ వర్షాలు: జనజీవనం అస్తవ్యస్తం..ఐఎండి హెచ్చరిక

Webdunia
గురువారం, 7 జులై 2022 (20:51 IST)
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీరప్రాంతాలతో పాటు మల్నాడులో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
 
తీర ప్రాంత జిల్లాలైన కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించింది.
 
పలు నివాసాలు, భవనాలు, విద్యుత్‌ స్తంభాలు, ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లింది. మంగుళూరు జిల్లాకు 30కిలోమీటర్ల దూరంలోని పంజికల్లు గ్రామం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
దీంతో పొలంలో పనిచేస్తున్న ఐదుగురు కూలీలు బురదలో చిక్కుకుపోయారు. ఐదుగురిని బయటకు తీశామని.. అయితే వారిలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
 
వరద ప్రాంతాల్లో సర్వే నిర్వహించాల్సిందిగా అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments