Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో భారీ వర్షాలు: జనజీవనం అస్తవ్యస్తం..ఐఎండి హెచ్చరిక

Webdunia
గురువారం, 7 జులై 2022 (20:51 IST)
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీరప్రాంతాలతో పాటు మల్నాడులో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
 
తీర ప్రాంత జిల్లాలైన కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించింది.
 
పలు నివాసాలు, భవనాలు, విద్యుత్‌ స్తంభాలు, ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లింది. మంగుళూరు జిల్లాకు 30కిలోమీటర్ల దూరంలోని పంజికల్లు గ్రామం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
దీంతో పొలంలో పనిచేస్తున్న ఐదుగురు కూలీలు బురదలో చిక్కుకుపోయారు. ఐదుగురిని బయటకు తీశామని.. అయితే వారిలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
 
వరద ప్రాంతాల్లో సర్వే నిర్వహించాల్సిందిగా అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments