Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో భారీ వర్షాలు: జనజీవనం అస్తవ్యస్తం..ఐఎండి హెచ్చరిక

Webdunia
గురువారం, 7 జులై 2022 (20:51 IST)
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీరప్రాంతాలతో పాటు మల్నాడులో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
 
తీర ప్రాంత జిల్లాలైన కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించింది.
 
పలు నివాసాలు, భవనాలు, విద్యుత్‌ స్తంభాలు, ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లింది. మంగుళూరు జిల్లాకు 30కిలోమీటర్ల దూరంలోని పంజికల్లు గ్రామం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
దీంతో పొలంలో పనిచేస్తున్న ఐదుగురు కూలీలు బురదలో చిక్కుకుపోయారు. ఐదుగురిని బయటకు తీశామని.. అయితే వారిలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
 
వరద ప్రాంతాల్లో సర్వే నిర్వహించాల్సిందిగా అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments