Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడి మంటలు: అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

ఐవీఆర్
బుధవారం, 29 మే 2024 (22:53 IST)
ఢిల్లీలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రాజధాని ఢిల్లీలోని ముంగేష్‌పూర్ ప్రాంతంలో బుధవారం అత్యంత వేడిగా ఉంది. ఇక్కడ 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం అంటే నిన్న ముంగేష్‌పూర్‌లో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ ఇప్పటికే బుధవారం మే 29 హీట్, హీట్ వేవ్ గురించి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంగేష్‌పూర్ వాతావరణ కేంద్రంలో అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం అధిపతి తెలిపారు.
 
పదేళ్లలో ఢిల్లీలో ఉష్ణోగ్రత 7 డిగ్రీలు మేర పెరిగింది
ఢిల్లీ హీట్ ఐలాండ్స్ నగరంగా మారింది. గత దశాబ్దంలో, రాజధాని ఉష్ణోగ్రత సగటున ఏడు డిగ్రీల సెల్సియస్ పెరిగింది. మే 2014లో సాధారణంగా 30-33 డిగ్రీల వేడి ఉండే ఢిల్లీ, మే 2024లో 40 డిగ్రీల దాకా వచ్చేసింది. జూన్ మొదటి వారం వరకు ఢిల్లీలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు వుంటాయని అంచనా.
 
మే నెలలో ఢిల్లీ ఉష్ణోగ్రతపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ పరిశోధన చేసింది. మే 2014లో ఢిల్లీ సగటు ఉష్ణోగ్రత 30-33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కాగా ఇందులో కూడా చాలా ప్రాంతాలు ఉత్తర, నైరుతి ఢిల్లీ శివార్లలో ఉండేవి. దీనికి విరుద్ధంగా 2022లో, ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఇలా క్రమేణా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments