Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లారేసరికి ఇంటిపై రూ. 40 లక్షల మూట, అది చూసిన అతడు ఏం చేసాడంటే?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (22:26 IST)
డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. పచ్చనోటు కనబడితే నొక్కేయాలని చాలామంది చూస్తుంటారు. ధనానికున్న పవర్ అది. ఐతే తెల్లారి లేచిన అతడికి తన ఇంటి పైకప్పుపై రెండు బ్యాగులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే నోట్ల కట్టలు, బంగారం వుంది. అంతే... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో నివాసం వుంటున్న వరుణ్ శర్మ బుధవారం పొద్దునే లేచి ఇంటి బయటకు వచ్చి పైకి చూడగానే తన ఇంటిపైకప్పుపై రెండు బ్యాగులు కనిపించాయి. అవి ఏంటా అని కిందికి దింపి చూస్తే అందులో డబ్బు నోట్ల కట్టలు, బంగారం వున్నాయి. సహజంగా ఇలా డబ్బు కనబడితే ఎవరైనా కాస్తోకూస్తో నొక్కేయాలని చూస్తారు.
 
కానీ అతడు మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శర్మ ఇంటికి ఆనుకుని వున్న భవనం నుంచి ఈ బ్యాగులు పడవేసినట్లు తేల్చారు. ఆ ఇంట్లో దొంగతనం చేసి, ఇంటికి అమర్చిన సిసి కెమేరాలకు కనబడకుండా వుండేందుకు ఇలా బ్యాగులను విసిరేసినట్లు తేల్చారు. ఈ పని చేసింది ఆ ఇంటికి సెక్యూరిటీగా వుండే నేపాల్ వ్యక్తి అని ప్రాధమిక విచారణలో తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments