ఉద్యోగం ఇస్తానని ల్యాబ్‌కు రమ్మని యువతిపై అత్యాచారం, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:26 IST)
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ క్రైం రేటు పెరిగిపోతోంది. స్త్రీలు ఒంటరిగా తిరగాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ.
 
ఉద్యోగం ఇస్తానని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ 18 యేళ్ళ యువతిపై అత్యాచారం చేశాడు. ఇది కాస్త రాజధానిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో ఢిల్లీలో ల్యాబ్‌లకు బాగా డిమాండ్. దీంతో కొంతమంది యువతీయువకులు ల్యాబ్‌లో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
 
అలా వెళ్ళిన ఒక యువతి తన వివరాలను ల్యాబ్ యజమానికి ఇచ్చింది. అయితే అందులో పనిచేసే టెక్నీషియన్ యువతి బయోడేటా చూసి ఆమె నెంబర్‌కు ఫోన్ చేశాడు. తమ సంస్థకు సంబంధించిన ల్యాబ్ మరో ప్రాంతంలో ఉందంటూ అక్కడికి పిలిపించుకున్నాడు.
 
యువతి ఒంటరిగా రావడంతో ల్యాబ్ టెక్నీషియన్ పని సుళువుగా మారిపోయింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. రెండురోజుల క్రితం ఘటన జరిగితే బాధితురాలు చెల్లి అసలు విషయం కనుక్కుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments