Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌కు లాఠీ దెబ్బ.. కిందపడిన నేతను పైకి లేపిన కార్యకర్తలు

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (16:54 IST)
కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ పోలీసులు లాఠీ దెబ్బ రుచిచూపించారు. హత్రాస్ జిల్లాలో అత్యాచారనికి గురై చనిపోయిన యువతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరిన రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. వారి కాన్వాయ్‌ను నిలిపివేశారు. దీంతో వారు కాలి నడకన బాధితురాలి ఇంటికి యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై బయలుదేరారు. అయితే, కొంతదూరం వెళ్లనిచ్చాక.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
 
హత్రాస్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడికి వెళ్లడం మానుకోవాలని పోలీసులు రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఆయన ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. 
 
కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు తమ లాఠీలకు స్వల్పంగా పని చెప్పాల్సివచ్చింది. ఈ క్రమంలో జరిగిన పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు.
 
ఆ తర్వాత సహచర నేతలు, కార్యకర్తలు కలిసి ఆయన్ను పైకిలేపారు. పోలీసుల లాఠీ దెబ్బతో పాటు.. కిందపడటతో రాహుల్ గాంధీకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ రాహుల్‌ను పరామర్శించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments