Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్రాస్ బాధితురాలిని ఆమె తల్లి.. సోదరుడే చంపేశారట... నిందితుల లేఖ

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (12:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన దళిత యువతి హత్యాచార కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులు యూపీ పోలీసులకు ఓ లేఖ రాశాడు. హత్రాస్ బాధితురాలిని ఆమె తల్లి, సోదరుడే చంపేశాడంటూ పేర్కొన్నారు. 
 
పైగా, ఈ కేసులో తామంతా నిరపరాధులమని, కావాలనే ఈ కేసులో ఇరికించారని అతను ఆరోపించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న సందీప్, రాము, లవ్ కుష్, రవి యూపీ పోలీసులకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో వారు సంచలన ఆరోపణలు చేశారు.
 
ప్రధాన నిందితుడైన సందీప్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఆ యువతిపై తాను లైంగిక దాడి చేయలేదని పేర్కొన్నాడు. బాధితురాలు తనకు ముందుగానే తెలుసన్నారు. ఆమె మరణానికి తల్లి, సోదరుడు కారణమని, తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించాడు. 
 
ఆమె సోదరుడు తనకు స్నేహితుడేనని, వారిద్దరూ తరచూ కలుస్తూ, ఫోనులో మాట్లాడుకుంటూ ఉంటారని కూడా తెలుస్తోంది. సందీప్ కోసం ఓ ఫోన్ నంబరును బాధితురాలి సోదరుడు తన పేరు మీద రిజిస్టర్ చేసి, కొని ఇచ్చాడని కూడా తెలుస్తోంది. 
 
కాగా, ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉండటంతో కేసు విచారణను మరింత లోతుగా జరపాలని అధికారులు నిర్ణయించారు. నిందితులకు అండగా క్షత్రియ సమాజం నిలిచిందన్న సంగతి తెలిసిందే. వారంతా అమాయకులని ఓ వర్గం వాదిస్తోంది. 
 
బాధితురాలి మృతి తర్వాత తొలుత అత్యాచారం జరగలేదని రిపోర్టు రావడం, ఆపై జరిగిందని దాన్ని మార్చడం తదితర పరిణామాలు, విచారణను జఠిలం చేయనున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం