Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో ఎక్కిన మహిళపై గ్యాంగ్ రేప్.. ఆమె చేతిలో ఉన్న చిట్టితల్లిని రోడ్డుపైకి విసిరేశారు..

హర్యానాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఎనిమిది నెలల బిడ్డతో కలిసి ఆటో ఎక్కిన మహిళలపై కామాంధులు కిరాతకంగా వ్యవహరించారు. ఏకంగా ముగ్గురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా.. ఆమె చే

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (12:26 IST)
హర్యానాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఎనిమిది నెలల బిడ్డతో కలిసి ఆటో ఎక్కిన మహిళలపై కామాంధులు కిరాతకంగా వ్యవహరించారు. ఏకంగా ముగ్గురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా.. ఆమె చేతిలోని ఎనిమిది నెలల చిట్టితల్లిని రోడ్డుపైకి విసిరేశారు. ఈ ఘటనతో తలకు తీవ్రంగా గాయాలైన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మే 29న ఈ ఘటన జరగినప్పటినీ.. సోమవారమే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల బాధితురాలి భర్తకు ఇరుగుపొరుగు వారితో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఇంటి నుంచి కోపగించుకుని వెళ్ళిపోయాడు. దీంతో  బాధిత మహిళ ఆ రాత్రి ఖండా రోడ్డులో ఉండే తన తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరింది. ఆటో ఎక్కిన వెంటనే కామాంధులు తన పక్కకు వచ్చి లైంగికంగా వేధించారు.
 
ఏడుస్తున్న పాపను బలవంతంగా తన చేతుల్లోంచి లాక్కుని రోడ్డుపైకి విసిరేశారని ఏడుస్తూ పేర్కొంది. తనపై అత్యాచారం చేసిన అనంతరం వారు పారిపోయారని వివరించింది. ఈ దుర్ఘటనపై  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య, వేధింపుల కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం