Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోక్షం పేరిట పూజలు... 120 మంది మహిళలపై అత్యాచారం ఎక్కడ?

హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. మోక్షం పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని పలువురు మహిళను నమ్మించిన నకిలీ బాబా ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం జరిపారు.

Webdunia
శనివారం, 21 జులై 2018 (09:06 IST)
హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. మోక్షం పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని పలువురు మహిళను నమ్మించిన నకిలీ బాబా ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఫతేబాద్ తోహానా పట్టణానికి చెందిన 60 యేళ్ళ మాంత్రికుడు ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా వారందరి వీడియోలు చిత్రీకరించిన ఘటన సంచలనం రేపింది.
 
ఫతేబాద్ తోహానా పట్టణానికి చెందిన బాబా అమర్‌పురి అలియాస్ బిల్లు ఓ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఈయన తన ఆశ్రమానికి వచ్చే మహిళలతో మోక్షం పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించేవాడు. ఈ పూజలకు సమ్మతించిన మహిళలను ఒక ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి, మాయమాటలతో లోబరుచుకునేవాడు. ఆ తర్వాత ఆ మహిళను శారీరకంగా లొంగదీసుకునేవాడు. ఇలా 120 మంది మహిళలతో రాసలీలలు కొనసాగించాడు. 
 
అనంతరం ఆ దృశ్యాలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ వారిపై పలు సార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీనిపై పలువురు బాధిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు... బాబా రాసలీలలు నిజమేనని తేలాయి. అలాగే, అత్యాచారానికి గురైన 120 మంది మహిళల వీడియో క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఫతేబాద్ మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ బిమ్లాదేవి రంగంలోకి దిగి బాబా అమరపురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అత్యాచారానికి గురైన మహిళలను సంప్రదించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments